దుధ్వా నేషనల్ పార్క్ ఇండో నేపాల్ బోర్డర్ లో ఉత్తర ప్రదేశ్ లోని తెరాయి బెల్ట్ లో కలదు. దీనిని 1958 లో ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి గా స్థాపించారు. 1977 లో ఇది ఒక నేషనల్ పార్క్ గా ప్రకటించారు.
నేడు దీనిలో రెండు భాగాలు కలవు. అవి కిషన్ పూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు కతమియా ఘాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి లు. పార్క్ లోని భూమి ఎన్తూ సారవంత మైనది. అనేక సరస్సులు, మడుగులు, వాగులు వంకలు, వుంటాయి. సారవంతమైన ఈ గంగా మైదాన భూమి లో ఎన్నో రకాల జంతువులు, పక్షులు, నీటి జంతువులు, సంచరిస్తాయి.
పక్షి ప్రియులకు ఈ సంక్చురి ఒక స్వర్గం గా వుంటుంది. ఇక్కడకు స్థానిక మరియు వలస పక్షులు కూడా వస్తాయి. పక్షులు చూడగోరే వారు బ్యాంకే తాల్ కు వెళ్లి వాటిని చూసి ఆనందించవచ్చు. మొసళ్ళు, పాములు కూడా అధిక సంఖ్యలో సహజ వాతావరణం లో జీవిస్తూ వుంటాయి. ఈ పార్క్ లో అరుదైన అనేక రకాల జంతువులను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications