రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం దుంగార్పూర్ పూర్వ వైభవం గురించి సంగ్రహావలోకనం కలగాలంటే చూడవలసిన ప్రదేశం. ఈ మ్యూజియం లో 6వ శతాబ్దానికి చెందిన వివిధ దేవతల, చిన్న చిత్రాలూ, రాతి శాసనాలూ, నాణాలూ, మెటల్ విగ్రహాల అరుదైన సేకరణను వివరించే మూడు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి గ్యాలరీలో భారతదేశ చరిత్రలో గుప్తుల కాలానికి చెందిన వివిధ విగ్రహాలను చూడవచ్చు. వీటిని గాలియాకోట్, అమ్జ్హారా, బరోడాల నుండి సేకరించారు. తాంత్రిక గణేష్, జింక చర్మం ధరించిన బ్రాహ్మి, వీణ కలిగిన శివుడు, పద్మిని, పద్మపాణి యక్ష, గరుడ పక్షిపై స్వారీ చేస్తున్న వైష్ణవి మొదలైన ప్రత్యేకమైన విగ్రహాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ మ్యూజియం రెండవ గ్యాలరీలో ప్రసిద్ధ కుతుబ్ మీనార్ ప్రతిరూపం, తపాలా బిళ్ళలతో చేసిన విజయ్ స్తంభ్ చూడవచ్చు, ప్రయాణీకులు మూడవ గ్యాలరీలో టెర్రకోటా శిల్పాలు, ఆయిల్ పెయింటింగ్ లు, ఛాయాచిత్రాల తోపాటు భారీగా సేకరించిన శాసనాలను చూడవచ్చు.