వనేశ్వర్ ఆలయం, సోమ్, మహి నదుల సంగమం వద్ద ఏర్పడిన పీఠభూమి. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఈయనను ఇక్కడ శివలింగ రూపంలో పూజిస్తారు. ప్రతి ఏటా, మాఘ శుక్ల ఏకాదశి నుండి మాఘ శుక్ల పూర్ణిమ (ఫిబ్రవరి) వరకు ఈ ఆలయంలో ఒక గిరిజన పండుగ జరుగుతుంది. భిల్ తెగలో అధిక ప్రాముఖ్య౦ ఉన్న ఈ పండుగ వనేశ్వర్ ఉత్సవంగా పిలువబడుతుంది. పర్యాటకులు ఈ పండుగ సమయంలో స్థానిక గిరిజ సంస్కృతి చవి చూస్తారు. ఈ పండుగ సందర్భంగా దేవుడికి పూజలు చేసేందుకు అనేక మంది భక్తులు బనేశ్వర్ దేవాలయానికి వస్తారు. 1850 సంవత్ లో నిర్మించిందని చెప్పబడే దగ్గరలోనే వున్న విష్ణ్వాలయాన్ని కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు.