ఫతేపూర్ సిక్రీ లోని ప్రధాన కోట ప్రాంగణంలో ఉన్న అక్బర్ హిందూ భార్య – జోధాబాయి నివాసమైన మరియం-ఉజ్-జామాని భవనం మొఘల్ నేపధ్యం కల్గిన అందమైన భవనం. ఇది అక్బర్, అతని కుమారుడు జహంగీర్ కాలంలో కూడా అధికార కేంద్రంగా ఉండేది.
మరొక విశ్వాసాన్ననుసరించి టర్కీ సుల్తాన్ నివాసంగా కూడా దీనిని పిలుస్తారు కారణ౦ ఇది అతని ముస్లిం భార్య నివాసంగా ఉండేది. అయితే, దీని చిన్న పరిమాణం కారణంగా వివాదాస్పద౦గా ఉంది.
ఈ భవనం దాని విలాసవంతమైన అలంకరణలకు, పూర్వీకుల నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఈ కట్టడం నిర్మాణానికి అక్బర్ ఎంతో ధనాన్ని ఖర్చు చేసి, ఉత్తమ కార్మికులను నియమించాడు. పరిసరాలలోని తోటలు, భవనం అంతటా ఉన్న చెక్కడాలు ఈ అద్భుతమైన భవనం అందాన్ని ఇనుమడింప చేస్తుంటాయి. క్షేత్రగణిత౦, పూల రూపకల్పనల భారీ కళాత్మకమైన పనిని కల్గి ఉండటం వెలుపలి, లోపలి రెండింటి భాగాల లక్షణం.



Click it and Unblock the Notifications