జాతీయ రహదారిపై గాంధీనగర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదాలాజ్ మెట్ల బావి లేదా ఆదాలాజ్ వావ్ (గుజరాతీ) ప్రత్యెక హిందూ భావి. ఇది అద్భుతమైన నిర్మాణానికి, కష్టమైన చేక్కుళ్ళకు పేరుగాంచింది. దీనిని వఘేల రాజు వీర్ సింగ్ భార్య అయిన రుదాబాయి రాణి కోసం ముస్లిం రాజు మొహమ్మద్ బేగ్డా 1499 లో నిర్మించారు. పుష్కలమైన నీటికోసం, గోడలపై చెక్కిన దేవతలను ప్రార్ధించడానికి ఈ భావిని సందర్శించడం వలన ఈ ప్రాంతం గ్రామస్తులలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. గోడలు పౌరాణిక పాత్రలు, సన్నివేశాలతో చెక్కబడ్డాయి.
ఈ భావి ఇండో-ఇస్లామిక్ కళానైపుణ్యానికి, అలంకరణలకు అందమైన నమూనా. దీని అనూహ్యమైన నిర్మాణ శైలి కారణంగా, మధ్యాహ్నం సమయంలో కొంతసమయం మినహా సూర్యరస్మి ప్రత్యక్షంగా సాధారణంగా ఈ మెట్లను తాకదు. ఈ నిర్మాణం లోపల ఉష్ణోగ్రత పరిసరాల కంటే చల్లగా ఉంటుంది.