చావడా వంశపు రాజు వనరాజ్ చావడా చంపానేర్ ని స్థాపించారు, ఆయన మంత్రి చంపరాజ్ పేరిట ఈ రాజ్యం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అగ్నిశిలలు లేత పసుపు రంగుతో పూర్తిగా “చంపక” పుష్పాన్ని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. పావ్ ఘడ్ కోటను కిచి చౌహాన్ రాజపుత్రులు చంపానేర్ కి కొంచెం పైన నిర్మించారు, తరువాత దీనిని మహ్మద్ బేగ్డా ఆక్రమించారు. ఆయన ఇక్కడ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకుని దానికి మహ్ముదాబాద్ అని పేరుపెట్టాడు, ఆ నగరాన్ని పునర్నిర్మించి, అలంకరించి 23 సంవత్సరాలు అక్కడే గడిపాడు. తరువాత మొఘల్ పాలనలో రాజధాని అహ్మదాబాద్ కి మారడం వల్ల చంపానేర్ దాని కీర్తిని, ప్రాముఖ్యతను కోల్పోయింది.
అనేక సంవత్సరాలు ఇది అడవిలో ఒక భాగంగా మిగిలిపోయింది, తరువాత బ్రిటిష్ వారు సర్వే నిర్వహించడం వల్ల దాని ఉనికి మరోసారి బహిర్గతమయింది. దీని నిర్మాణం ఖచ్చితత్వంతో ఉండడం వల్ల ప్రజలు వాస్తుశిల్ప అందాన్ని చూడడానికి వచ్చేవారు. చంపానేర్ మసీదు, సికందర్ షాహ్ సమాధి, హలోల్, సాకర్ ఖాన్ దర్గా, మకాయి కోతార్/నవ్లఖ కోతార్, సిటాడెల్, హేలికాల్ మెట్ల భావి, బ్రిక్ సమాధి, పావ ఘడ్ కోట, ప్రాచీన ఆలయాలు, కోట గోడల ద్వారాలు, జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం, కేవ్ది ఎకో కాంప్ స్థలం, ధన్పరి ఎకో కాంప్ స్థలం మొదలైనవి చంపానేర్ లో సందర్శించదగ్గ ప్రదేశాలు.
పావ్ ఘడ్ కోట గోడల భాగాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. బరోడా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపానేర్ ని బస్సులు, ఇతర వాహనాలలో తేలికగా చేరుకోవచ్చు. చంపానేర్ ను 2004 లో యునెస్కో సైట్ గా ప్రకటించారు.