నర్మదా నది పై నిర్మించబడిన సర్దార్ సరోవర్ ఆనకట్ట, నది పుట్టిన ప్రదేశం నుండి 1163 కి.మీ.లు వుంటుంది. ఈ డాం పునాది 1961 లో జవహర్లాల్ నెహ్రు వేసారు. నిర్మాణపు పని 1979 లో మొదలైంది. ఇక్కడ డాం ఆఫీసు లో ఒక మాప్ కలదు. దీనిలో పర్యాటకులు చూడవలసిన ఆరు ప్రదేశాలు చూపుతారు. అవి ఒక గార్డెన్, ఫౌండేషన్ స్టోన్ బోటింగ్ విహారం మొదటి లాక్ గేటు మరియు విద్యార్ధులకు ట్రెక్కింగ్ పాయింట్ లు. సర్దార్ సరోవర్ డాం ఎత్తు 128 మీటర్లు దీనిని ఇంకా పెంచుతున్నారు. ఇది నర్మదా నదిపై అతి పెద్ద డాం. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి, పర్యావరణానికి కల వనరులు పూర్తి ఉపయోగానికి నిర్మించబడినది. ఈ డాం తాగు నీరు, సాగు నీరు మరియు గుజరాత్ కి పూర్తి స్థాయిలో విద్యుత్ ను అందిస్తుంది . ఈ డాం సమీపంలో కేవాడియా అనే టవున్ కలదు. ఇది ఎంప్లాయ్ కాలనీగా కట్టబడినప్పటికీ, ఇక్కడి అందాలు దీనిని ఒక టూరిస్ట్ ప్రదేశంగా మార్చాయి.
నర్మదా నదికి సంబంధించిన మత పర ప్రదేశాలు చందోడ్, కబిర్వాద్ మరియు కొన్ని శివ టెంపుల్స్ కూడా కలవు. చారిత్రాత్మక టవున్ లు అయిన భారుచ్ మరియు రాజ్ పిప్లా లు సర్దార్ సరోవర్ డాం సమీపంలో కలవు. రతన్ మహల్ స్లాత్ బేర్ సంక్చురి, దెదిఅపద రేంజ్ శూల్ పనేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి, విశాల ఖాది ఈకో క్యాంపు సైట్ సామోట్ మల్సామోట్ ఈకో క్యాంపు సైట్, సాగి మల్సమొత్ ఈకో కామ్ప్సితే జర్వాని ఈకో క్యాంపు సైట్ మరియు కన్జేతా ఈకో క్యాంపు సైట్ వంటివి నర్మదా జిల్లాలో చూడవచ్చు.