ఉద్వాడ, వల్సాడ్ జిల్లాలోని ఒక కోస్తా పట్టణం, పార్సీలు లేదా భారతీయ జొరాస్ట్రియన్లకు ఒక ముఖ్య కేంద్రం. ఉద్వాడ అంటే ‘ఒంటెలు తిరిగే మైదానం’ అని అర్ధం – జనావాసాలు లేనప్పుడు ఇక్కడి పరిస్థితి అదే. పార్సీలు లేదా పర్షియా వాసులు (ప్రస్తుతం ఇరాన్) 10వ శతాబ్దంలో ముస్లింల హింస కారణంగా భారతదేశానికి వచ్చారు. వల్సాడ్ గుండా వారు భారత దేశానికి వచ్చి సంజన్ రేవును స్థాపించారు.
ఉద్వాడలోని ప్రధాన ఆకర్షణ వారు ఇరాన్ నుండి తీసుకు రాగలిగిన అతాష్ బెహ్రం అనే పవిత్రమైన అగ్ని, వారి విశ్వాసం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన అగ్ని. వీరు ఏర్పరచిన సంజన్ రేవు వద్దకు దీనిని తీసుకోచ్చారు. తర్వాత మొహమ్మద్ బీన్ తుఘ్లక్ దాడుల వలన సంజన్ ను వీడ వలసి వచ్చి నందున వీరు ఉద్వాడ అతాష్ బెహ్రంలో దీనిని స్థాపి౦చేసారు.
ఉద్వాడ అతాష్ బెహ్రం ప్రపంచంలోని తొమ్మిది అతాష్ బెహ్రంలలో ఒకటి. ఈ భవనాన్ని చాలాసార్లు పునరుద్ధరించారు. అతాష్ బెహ్రం ప్రపంచంలోని నిరంతరం మండుతున్న అతి పురాతన ఆలయ అగ్ని. అతాష్ బెహ్రం స్థాపన దినం, షహన్ షాహీ లేదా రాచరిక జొరాస్ట్రియను క్యాలెండర్ తొమ్మిదవ నెల లోని తొమ్మిదవ రోజును ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటారు.
“విజయాని”కి ప్రతీకైన వేరేత్రజ్ఞ వేడుకలను ప్రతి నెలలో 20 వ తేదిన జరుపుకుంటారు. ఉద్వాడ బీచ్, పార్సీ ఆహరం కూడా పర్యాటకులు ఉద్వాడ సందర్శించడానికి కొన్ని ఆకర్షణలు