సరిత ఉద్యాన్, గాంధీనగర్ లో 9 సెక్టార్ లో ఉంది. ఇది ప్రయాణీకులు, పర్యాటకులలో ప్రసిద్ధ విహార స్థలం. ఈ ప్రాంతం ప్రత్యేకంగా వినోద కార్యకలాపాల కోసం నిర్మించబడింది. సంవత్సరం పొడవునా సరిత ఉద్యాన్ ని సందర్శించ వచ్చు.
గాంధీనగర్ లోని ఇంద్రోడా డైనోసార్, ఫాస్సిల్ పార్కు, లేదా ఇంద్రోడా నాచుర్ పార్క్ సబర్మతి నది పై 400 హెక్టార్ల భూమిపై ఉంది. ఇది ప్రపంచంలోని డైనోసార్ గుడ్లకు రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా భావించబడుతుంది. భారతదేశంలో మాత్రమే డైనోసార్ మ్యూజియం ఉన్న ప్రకృతి పార్కును గుజరాత్ ఎకొలాజికల్ ఎడ్యుకేషన్, రిసర్చ్ ఫౌండేషన్ (జిఇఇఆర్) వారు నడుపుతున్నారు.
నీలి తిమింగలం తోపాటు అనేక సముద్ర క్షీరదాల అస్తిపంజరాలు, ఆమ్ఫిధిఏటర్, బొటానికల్ గార్డెన్ కూడా ఉన్న ఈ పార్కు కి “భారతదేశ జురాసిక్ పార్కు” అనే మరోపేరు ఉంది. ఇది వివరణ కేంద్రంగానే కాకుండా కాంపింగ్ కి కూడా అనేక సదుపాయాలను అందిస్తుంది.