హిందువుల దేవుడు శివుడికి దక్ష మహాదేవ టెంపుల్ అంకితం చేయబడినది. ఇది హరిద్వార్కు 4 కి. మీ. ల దూరం లో కలదు. ఈ టెంపుల్ ని క్రి. శ. 1810 లో రాణి ధన్కూర్ నిర్మించగా, మరో మారు 1962 లో పునర్ నిర్మాణం చేసారు.
పురానేతిహాసాల మేరకు, ఈ ప్రదేశం లో దక్ష యజ్ఞం చేసారు. దీనిని దక్ష ప్రజాపతి అంటే హిందూ దేవత సతి తండ్రి చేసాడు. ఈ క్రతువు కు ఆయన తన అల్లుడు శివుడిని తప్పించి అందరిని ఆహ్వానించి శివుడిని అవమాన పరచాడు. దానికి గాను సతి తన తాండ్ర చేసిన అవమాన ప్రవర్తన కు పరిహారంగా పవిత్ర యజ్ఞ కుండం లో తనను తాను ఆహుతి చేసుకొంటుంది. నేటికి ఈ టెంపుల్ లో సతి ఆహుతి చేసుకొన్నా ఒక చిన్న కుండం కలదు.
టెంపుల్ మధ్య భాగం లో శివుడి విగ్రహం వుంటుంది. ప్రతి సంవత్సరం స్రావాన్ మాసం లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు.