మల్నాడు ప్రాంతంలోని గడిమనె ను పర్యాటకులు తప్పక చూసితీరాలి. గడిమనె గ్రామం చితార ఆర్టు వర్కుకు ప్రసిద్ధి. దీవా జాతికి చెందిన ఈ గ్రామస్తులు చితార అనే కళా నైపుణ్యతలు కలిగి ఉన్నారను. ఈ గ్రామం చేరిన వెంటనే పర్యాటకులు అక్కడ గ్రామస్తులచే గోడలపై వేయబడిన అందమైన పెయింటింగుల నిపుణతకు ఆశ్చర్యపడాల్సిందే. కొన్ని శుభ మరియు ప్రత్యేక సందర్భాలలో ఈ స్ధానికులు వారి ఇంటిగోడలను సైతం వివిధ బొమ్మలు వేసి అలంకరిస్తారు. ఈ పెయింటింగులను వేయించిన బియ్యపు పౌడర్ తోను అక్కడి అడవులలో లభించే పండ్ల రంగులతోను వేస్తారు. అయితే, దురదృష్టవశాత్తూ నేడు ఈ కళ అంతరించిపోతోంది.
చరిత్రలోకి జారిపోతున్న ఈ హస్త కళలను పునరుజ్జీవం చేయాలని కొంతమంది ప్రయత్నించినప్పటికి ప్రయోజనం అతి తక్కువగా ఉంది. గడిమనె దర్శించే పర్యాటకులు ఈ పెయింటింగులను చూసి ఆనందించవచ్చు. ఇవి గుహల పెయింటింగ్ లను గుర్తు తెస్తాయి.