షిమోగా జిల్లాలోని సాగర సిటీ కి దగ్గరగా కెలాడి దేవాలయాల పట్టణం ఉంది. ఈ ప్రదేశంలో ఒక మ్యూజియం మరియు పురాతన శివాలయం ఉన్నాయి. ఉత్తర కర్నాటక పర్యటనకు వచ్చేవారు ప్రకృతి అందాలు తిలకించి ఆనందించేందుకు అదే సమయంలో దేవాలయాలు దర్శించేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో మూడు దేవాలయాలున్నాయి. అవి వీరభద్ర, పార్వతి మరియు రామేశ్వర.ఈ దేవాలయాలు పర్యాటకులకు కెలాడి నాయకులు, ఇతర వంశస్ధులు పాలించిన సమయాన్ని గుర్తు చేస్తాయి. ఈ మూడు దేవాలయాలు ద్రవిడ మరియు హొయసల శిల్ప కళా నైపుణ్యతలను ప్రదర్శిస్తాయి. కెలాడి మ్యూజియంలో నేటికి కెలాడి నాయకుల పాలనలో రచించిన కొన్ని పురాతన గ్రంధాలున్నాయి. ఈ మ్యూజియంలో విలువైన మరియు చరిత్ర ప్రాధాన్యతగల శాసనాలు, నాణేలు, తాళ పత్ర గ్రంధాలు ఉంచబడ్డాయి.