షిమోగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం సాగర హొన్నెమర్దులోని జోగ్ ఫాల్స్ వద్ద ఉంది. ఈ పట్టణం చారిత్రక ప్రదేశాలైన ఇక్కేరి, కెలాడి మొదలైన వాటికి సమీపంలో ఉంది. కెలాడి వద్ద కెలాడి వంశస్ధుడైన సదాశివ నాయక సదాశివ సాగర సరస్సు నిర్మించాడను. ఇప్పుడు ఆ సరస్సును గణపతి కెరె లేదా గణపతి సర్సు అంటారు. ఈ పట్టణంలో మరికాంబ దేవాలయం, మహాగణపతి దేవాలయం ఉన్నాయి. పర్యాటకులకు ఈ దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఈ పట్టణం వరద నది మూల స్ధానం అయిన వరదమూలకు సమీపంలో ఉంది. ఈ పట్టణం చుట్టూ అందమైన అడవులు, నీటి సరస్సులు, వరదా నది మొదలైనవి ఆ కాలంనాటి కెలాడి వంశస్ధులను ఆకర్షించాయి. ఇక్కడి సరస్సును గణపతి సరస్సు అని అంటారు.