ఇక్కేరి అంటే రెండు వీధులు అని కన్నడ భాషలో చెపుతారు. షిమోగా జిల్లాలోనే సాగర పట్టణం వద్ద ఇది ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ1640 వరకు కెలాడి పాలకులకు రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో గ్రానైట్ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ శిల్ప నైపుణ్యతలో చాళుక్యుల, ద్రవిడుల, హొయసలుల, దక్కన్ సుల్తానుల మరియు విజయనగర పాలకుల శిల్ప కళా నైపుణ్యాలు కనపడతాయి. ఈ దేవాలయ రాతి గోడలు వివిధ రకాల బొమ్మలు కలిగి ఉంటాయి. గుడులు, ఏనుగులు, పురాతన కన్నడ లిపి వంటివి వీటిలో కొన్ని. దేవాలయానికి పడమటి, తూర్పు మరియు ఉత్తర భాగాలలో చక్కటి మార్గాలుంటాయి. ఉత్తర ద్వారం వద్ద రెండు ఏనుగులుంటాయి. ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య మరియు గణేష బొమ్మలను కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ అఘోరేశ్వర దేవాలయ నిర్వహాణా భాధ్యత భారత దేశ పురావస్తు శాఖ వారిపై ఉంది.