పర్యాటకులు కలశేశ్వర దేవాలయాన్ని కూడా హొరనాడులో సందర్శించవచ్చు. ఈ దేవాలయం హొరనాడుకు అరగంట ప్రయాణంలో కలశ అనే ప్రదేశంలో సమీపంలో భద్ర నది పారుతూండగా ఒక కొండపై ఉంటుంది. దేవాలయంలో రెండు ఏనుగుల విగ్రహాలుంటాయి. వాటిలో ఒకటి గణేశుడుగాను మరి ఒకటి అతని భార్య లేదా ఆడ ఏనుగుగాను చెపుతారు. రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే, మగ ఏనుగు తన కాలికింద ఒక రాక్షస విగ్రహం కలిగి ఉంటుంది. ఈ రాక్షసుడిని భతవంతుడైన గణేశుడు వధించాడని చెపుతారు. పర్యాటకులు కలశేశ్వర విగ్రహాన్ని ఒక లింగం రూపంలో చూస్తారు. దీనినే కలశంలో సాక్షాత్కరించిన శివ భగవానుడిగా కూడా భావిస్తారు.



Click it and Unblock the Notifications