చంద్రప్రభు దేవాలయం జైసల్మేర్ కోట లోని జైన దేవాలయం. దీన్ని 1509లో నిర్మించారు. 8వ జైన తీర్థంకరుడు చంద్రప్రభు కోసం నిర్మించిన ఈ దేవాలయ౦ దేశంలోని ఏడు ప్రధాన జైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఎర్ర రాతి దేవాలయం తన రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది. క్లిష్టతరమైన చెక్కుళ్ళు, రేఖాకృతులు, అందమైన ముఖభాగాలు ఈ గుడి అందానికి వన్నె తెచ్చాయి.