జైసల్మేర్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో వున్న సాం ఇసుక తిన్నెల్లో జరిగే ఎడారి ఉత్సవం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటెల పందేలు, తలపాగా చుట్టడం, ఉత్తమ మీసకట్టు పోటీలు యాత్రికులు ఆస్వాదిస్తారు. రాజస్థాన్ పర్యాటక శాఖ నిర్వహించే మూడు రోజుల ఉత్సవం ఇది. ముందుగా రాజస్థాన్ కు విదేశీ యాత్రికులను ఆకర్షించడానికి ఇది మొదలు పెట్టారు. గైర్, ఫైర్ డాన్సర్లు చేసే శృంగార నృత్యాలు, ఒంటె సవారీలు ఇక్కడి పర్యటనను మరపురాని అనుభూతిగా తయారు చేస్తాయి.యాత్రికుల సౌకర్యం కోసం ఉత్సవాలు జరిగే చోట స్థానిక అధికార యంత్రాంగం మెడికల్ వ్యాన్లు, స్మారకాల దుకాణాలు, మొబైల్ మనీ ఎక్స్చెంజర్లను ఏర్పాటు చేసారు. ఇక్కడి షాపుల్లో క్రెడిట్ కార్డ్లు కూడా అనుమతిస్తారు.