లోడుర్వా, జైసల్మేర్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. భట్టి రాజవంశం 1156వ సంవత్సరం వరకు ఇక్కడ తమ రాజధానిని ఏర్పాటు చేసుకుంది. పురాతన జైన దేవాలయం ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో 23 వ జైన్ తీర్థంకరుడైన పార్స్వనాద్ విగ్రహం ఉంది. అయితే, ఈ ఆలయం అద్భుతమైన స్థితిలో లేనప్పటికీ, పసుపు ఇసుకరాయి నిర్మాణంతో, విలక్షణ రాజపుత్ర జాలీ పనితనంతో పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పర్యాటకులు దిల్వారా శైలిని ప్రదర్శించే అందమైన తోరణాలను చూడవచ్చు.
హింగ్లాజ్ మాత ఆలయం, చాముండి మాత ఆలయం, పాత శివాలయం ఈ ప్రాంత ఇతర ప్రధాన ఆకర్షణలు. ఈ చారిత్రక స్థలం థార్ ఎడారి ప్రాచీన వాణిజ్య మార్గంలో ఉంది.