మహారాజా పాలెస్, జైసల్మేర్ కోట సముదాయంలో ఉంది. దీనిని జైసల్మేర్ కోట భవన మ్యూజియం, హెరిటేజ్ సెంటర్ అంటారు. ఈ భవనం ఐదు అంతస్తులతో, అద్భుతంగా చెక్కిన కిటికీలు, బాల్కనీల తో ప్రసిద్ది చెందింది. చలువ రాయితో చేసిన ఈ రాజభవన ఎడమ ప్రవేశ ద్వారములో రాజులు తమ ప్రజలను సంభోదించేవారని భావిస్తారు. పర్యాటకులు ఇక్కడ వెండి పట్టాభిషేక సింహాసనం, మంచం, గిన్నెలు, స్థానిక స్టాంపులు, బ్యాంకు నోట్లు, శిల్పాలు చూడవచ్చు. ఈ భవన పై కప్పు నుండి జైసల్మేర్ నగర అద్భుత దృశ్యాలను చూడవచ్చు.
పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే మధ్యాహ్న౦పూట ఈ భవనాన్ని సందర్శించడం ఉత్తమం. ఈ భవనం సందర్శకుల కోసం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6 వరకు, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది.