జైసల్మేర్ నగర నడిబొడ్డున వుంది నాద్ మల్-జీ-కీ హవేలీ. రాజపుత్ర, ముఘలాయి శైలుల మిశ్రమంగా నిర్మితమైన భవంతిగా ఇది ప్రసిద్ది చెందింది. ఈ భవంతిని దివాన్ మోహతా నాద్ మల్ నివాసం ఉండేందుకు మహారావాల్ బెరిసాల్ నిర్మించారు. ఈ భవంతి అందమైన ముఖభాగాలను పక్షులు, ఏనుగులు, పూలు, సైకిళ్ళు, స్టీం ఇంజన్లు, సైనికుల రూపాల్లో తయారు చేసారు. ఈ భవనం గోడలపై చెక్కిన పశువులు, గుర్రాలు, పూల బొమ్మలను యాత్రికులు చూడవచ్చు. జైసల్మేర్ నుంచి కాలినడకన లేదా రిక్షా లో ఇక్కడికి చేరుకోవచ్చు.