రాం కుండా జైసల్మేర్ నగరం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాక్ నది ఒడ్డున ఉన్నది. మహారాజా అమర్ సింగ్ రాణి మన్సుఖీ దేవి నిర్మించిన పురాతన దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహం ఉంది, అయితే, పర్యాటకులు ఇక్కడ వినాయకుడు, మహిషాసురుడు, భైరవుని విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయ గోడలపై శాసనాలు చెక్కబడి ఉన్నాయి. 18 వ శతాబ్దానికి ముందు ఈ దేవాలయం వెలుపల గోవర్ధన మూలస్థంభం ఉండేది. పర్యాటకులు ఇక్కడి ఒంటె సవారీలను ఆస్వాదిస్తారు.