సలీం సింగ్ కీ హవేలీ జైసల్మేర్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో వుంది. ఈ అందమైన భవంతిని సలీం సింగ్ 1815లో నిర్మించాడు. దీని ముందు భాగం పడవ ముందు భాగం లాగా ఉండడం వల్ల దీన్ని జహాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. తోరణాలతో వుండే ఈ భవనం పై కప్పు నీలి రంగు గోపురాలు పెట్టారు. నెమలి ఆకారంలో మలిచిన బ్రాకెట్లను కూడా యాత్రికులు చూడవచ్చు. నిర్మాణం పూర్తి అవగానే సలీం సింగ్ హవేలీ ని మెహతా కుటుంబం ఆక్రమించుకుంది. ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా నిర్మించిన 38 బల్కనీలు ఈ భవంతిలో ఉన్నాయి. ఈ భవన ముఖద్వారాన్ని కొన్ని ఏనుగులు పహారా కాస్తూ ఉంటాయి. జైసల్మేర్ నించి రిక్షాల ద్వారా ఈ భవంతిని చేరుకోవచ్చు.