సాం ఇసుక తిన్నెలు కూడా జైసల్మేర్ నగరం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి ఎడారి లోని చాయా దృశ్యాలను చూడడానికి సంధ్యా సమయం సరైనది. చలి మంటలు, ఇసుక తిన్నెల్లో ఒంటెలు, జీపులపై ప్రయాణం యాత్రికులు ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో జరిగే ఎడారి ఉత్సవం ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక కేంద్రంగా మారుస్తుంది. తోలుబొమ్మలాటలు, జానపద నృత్యాలు, ఒంటెల పందేలు, బహిరంగ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఉత్సవంలోని ప్రధాన ఆకర్షణలు.