ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ వారిచే ఫిబ్రవరి చివరలో లేదా మార్చ్ ప్రారంభం లో ఒక వారం పాటు నిర్వహించబడే ఝాన్సీ మహొత్సవ్ కి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక నమ్మకాలను ప్రత్యేకించి బుదేల్ఖండ్ ప్రాంతం లో ని ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఈ పండుగలోని కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అర్కలాజికల్ మ్యూజియానికి సమీపం లో ఉన్న బహిరంగ ఆడిటోరియం లో సాయంత్రం పూట ఈ పండగ యొక్క ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ని సంగీతం మరియు నృత్య ప్రదర్శనలతో పాటు స్థానిక జానపద నృత్యాలు ఇంకా ఈ ప్రాంతం యొక్క సంస్కృతీ సంప్రదాయాలని వివరించే పాటల కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. రంగోలీ పోటీలు, మేహేందీ పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఆయుర్వేదిక్ రేసిపీలని కూడా వివరిస్తారు.
రాణి లక్ష్మీ బాయి పార్క్ మరియు నారాయణ్ బాగ్ ల లో భారీ మొత్తం లో పళ్ళు, పూలు మరియు కూరగాయల ప్రదర్శనల తో పాటు కళాకృతుల ప్రదర్శన లు కూడా ఉంటాయి.