అస్సాం లోని తొలి తేయాకు తోట సిన్నమోరా తేయాకు తోట తన తేయాకుకు ప్రసిద్ది చెందింది. 1850 వ సంవత్సరంలో ఈ తోట పని చేయడం మొదలు పెట్టింది. ఈ తోటను మణిరాం దివాన్ స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జోర్హాట్ లో నియమితుడైన ఒక సహాయ కమిషనర్ వద్ద మణిరాం దివాన్ సిరస్తాదార్ గా పని చేసాడు. సిన్నామోరా తేయాకు తోట జోర్హాట్ నగర కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వుంది.
కోతకు వచ్చినప్పుడు ఈ తేయాకు తోట పచ్చగా కళకళలాడుతూ అందంగా కనిపిస్తుంది. చిన్న తేయాకు మొక్కలు ఇరువైపులా వున్న సన్నటి దారిలో నడవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తేయాకు ఎలా కోస్తారో తెలుసుకోవాలనుకుంటే, అది సిన్నమోరా తేయాకు తోటలోనే నేర్చుకోవాలి. సంతోషంగా ఆహ్వానించే తేయాకు పని వారితో మాట్లాడుతూ నేర్చుకోవడం అంత కష్టం ఏమీ కాదు.
ఈ తేయాకు తోటకు చేరుకోవాలంటే, యాత్రికులు కాబ్ లను అద్దెకు తీసుకోవచ్చు లేదా జోర్హాట్ నగర కేంద్రం నుంచి నిత్యం తిరిగే ప్రజా రవాణా వాహనాల్లోనూ రావచ్చు.