పియో అని కూడా పిలువబడే రెకాంగ్ పియో, కిన్నార్ జిల్లా రాజధాని. సిమ్లా నుండి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం సముద్రమట్టం కంటే 2290 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చరిత్ర ప్రకారం, రెకాంగ్ పియో, గతంలో కనార్రా లేదా కిన్నారా గా పిలవబడేదని నమ్ముతారు. ఈ జిల్లాను, 9 వ మరియు 12 వ శతాబ్దాల మధ్య, టిబెట్ యొక్క గుగే రాజ్యం పాలించింది. కొన్నాళ్ళ తరువాత, అది (కలిసి ఉన్నట్టు భావించబడే) ఏడు భాగాలుగా విభజించబడటం వల్ల, సాత్ ఖుంద్ గా మారింది.
ఈ ప్రదేశం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే, ప్రధాన భారతీయ పండుగ అయిన, నాలుగు బుద్ధుల మహోత్సవానికి ఆతిథ్యం ఇస్తుంది. ఈ స్థలం సందర్శించడం కోసం వచ్చే యాత్రికులు, కిన్నార్ కైలాష్ పర్వతం యొక్క అద్భుత చిత్ర కోణాన్ని చూడగలరు. సాహస ప్రేమికులు, 4-5 రోజుల పాటు సాగే రెకాంగ్ పియో నుండి కిన్నార్ ట్రెక్ ను తీసుకోవచ్చు.