జాజ్ మావ్ నే జాజేస్ మావ్ అనే కూడా అంటారు. ఈ ప్రదేశం 19 వ శతాబ్దం లో ఏర్పడింది. కాన్పూర్ కు గ్రామీణ ప్రాంతం లో గంగా నది ఒడ్డున వుంటుంది. ఇపుడు పూర్తిగా పారిశ్రామిక నగరం అయింది. అర్కేయోలజికల్ సర్వేయ్ అఫ్ ఇండియా మేరకు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశం అతి పురాతన మానవ స్థారంగా పేర్కొన్నారు.
ఇక్కడి తవ్వకాలలో క్రి.పూ.1300- 1200 నాటి కళాకృతులు, మట్టి పాత్రలు వెల్లడయ్యాయి. ఇక్కడే చంద్రగుప్త మౌర్య కాలం నాటి ఒక ఐవరీ సీల్ కూడా దొరికింది. ఈ వస్తువులను కాన్పూర్ సంగ్రహాలయంలో ప్రదర్శిస్తున్నారు. ఈ సిటీలో తెల్లటి ఒక మసీదు కూడా కలదు. అది ఒక చిన్న కొండపై వుంటుంది. తెల్లగా వుంట్డటం వలన తాజ్ మహల్ పోలి ఉంటుందని అంటారు. మసీదుకు కొద్ది దూరంలో కొండ కింద హజరత్ మఖ్దూం షా అల అనే ఒక సూఫీ సెయింట్ సమాధి కలదు. దీనిని 1358 లో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు.