శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ను సుమారు అర్ధ శతాబ్దం కిందట సింఘానియా ఫ్యామిలీ కి చెందిన జే.కే.ట్రస్ట్ వారు నిర్మించారు. కనుక దీనిని జే.కే.టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ నిర్మాణంలో ఒక విశిష్టమైన పురాతన మరియు నవీన శిల్ప శైలి కనపడుతుంది. మండపాలకు మంచి గాలి , వెలుతురు కొరకు ఎత్తైన రూఫ్ నిర్మించారు.
ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో రాధా కృష్ణు లే కాక ఇంకా అయిదు గుడులు కూడా వుంటాయి. అవి హనుమాన్, లక్ష్మి నారాయణ, అర్ధనారీశ్వర మరియు నర్మదేశ్వర గుడులు. అందమైన ఈ విగ్రహాలు ఎత్తైన రూఫ్ కల ఒక మండపంలో వుంటాయి. శ్రీ రాధా కృష్ణ టెంపుల్ అందమైన ఒక పార్క్ మరియు సరస్సు పక్కన కలదు. రాత్రి దీపాల వెలుగులలో ఈ టెంపుల్ ధగ ధగ మెరిసి పోతూ వుంటుంది. ఈ వెలుగులు ఆ సరస్సులో పడి మరింత ఆకర్షణీయంగా వుంటాయి. టెంపుల్ కు ఎంట్రీ ఫీసు లేదు.