కరైకుడి టౌన్ లో ఉన్న ప్రసిద్ద ప్రాంతం ఆయిరం జన్నాల్ వీడు. ఈ పదాలకు అచ్చమైన అనువాదం 'వంద కిటికీలు కలిగిన ఇల్లు". ఈ పేరు ఈ ఇంటికి సరిగ్గా నప్పుతుంది.
కరైకుడి ని సందర్శించే పర్యాటకులు తప్పకుండ సందర్శించే ప్రదేశం ఇది. ఇక్కడికి చేరుకున్న తరువాత ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఎవరి నైన మార్గం తెలియచేయమనవచ్చు. 20,000 చదరపు అడుగుల ప్రాంతం లో నిర్మితమైన ఈ భవనం ఏంతో విసలమైనది. 1941 లో నిర్మించబడిన ఈ భవన నిర్మాణానికి ఆ సమయం లో 1 లక్షా 25 వేల రూపాయల ఖర్చు అయింది. పెద్దవైన 25 ఎకరాల గదులు, 5 అతి పెద్ద హాల్స్ ఈ భవనం సొంతం. 100 కిటికీల తో పాటు 20 తలుపులు ఈ భవనం లో గమనించవచ్చు.
ఈ భవనం యొక్క నిర్మాణ వైభవం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది అని ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరికి అనిపించే విషయం.