సమయం ఉన్నట్లయితే, పర్యాటకులు కర్కల పొలిమేరలలో ఉన్న అత్తూర్ గ్రామాన్ని దర్శించవచ్చు. 1759 AD లో స్థాపించబడ్డ సెయింట్ లారెన్స్ చర్చి వల్ల ఈ గ్రామం అత్యంత ప్రసిద్ది పొందింది. ఈ చర్చి టిప్పు సుల్తాన్ చే నిర్మూలించబడిన తర్వాత ఏర్పడిన పట్టణంలోని మూడవ చర్చగా భావిస్తారు.
రెండవ చర్చి కర్కల లోని నాక్రే చేరువలో నిర్మించబడినది. రెండవ చర్చి పాతబడిన తరువాత, ప్యారిషనర్లు సెయింట్ లారెన్స్ విగ్రహాన్ని కొత్తప్రదేశానికి మార్చడానికి నిర్ణయించుకున్నారు. ప్యారిషనర్లు ఈ గ్రామంలో సెయింట్ లారెన్స్ విగ్రహాన్ని ఉంచడానికి పుష్కరిణి చెరువు సమీపంలో చర్చిని నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. అత్తూర్ చర్చి లోని సెయింట్ లారెన్స్ స్వస్తపరిచే సామర్ధ్యం కలిగి ఉన్నాడని స్థానికుల నమ్మకం.
చర్చితో పాటు, సందర్శకులు ఈ ధార్మిక క్షేత్రం చుట్టు ఉన్న అందాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు. సామజిక కార్యకలాపాల ప్రదర్శనలో ప్రాముఖ్యత కలిగిన కర్కోల్ ఫెస్ట్ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు సెయింట్ లారెన్స్ చర్చని సందర్శిస్తారు. 1997 లో వివిధరకాల మతాలు, విశ్వాసాలకు చెందిన వారిని సంమటించే చర్చి సందేశానికి చిహ్నంగా 100 అడుగుల ఎత్తైన టవర్ నిర్మించబడింది.
అత్తుర్ ని సందర్శించేటప్పుడు, ప్రయాణీకులు రాగి పూతతో చేసిన గర్భ గృహంలో మహాగణపతి దేవాలయం, విష్ణు ఆలయం, మహాలింగేశ్వర అలయాలను దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications