కాసర్గోడ్ లో పుట్టి చరిత్ర ఖ్యాతి గాంచిన కన్నడ కవి ఎం. గోవింద పాయి పేరుపై గోవింద పాయి మెమోరియల్ అనే ఒక ప్రసిద్ధ వారసత్వ భవనం కలదు. ఈయనను గతంలోని మద్రాస్ ప్రభుత్వం ఆస్థాన కవి బిరుదు ని ఇచ్చి సత్కరించింది. ఆయనను రాష్ట్ర కవి అనే వారు. ఈయన ఆధునిక కవులలో గొప్పవాడు. ఈ మెమోరియల్ ను ఆయన జన్మించిన ప్రదేశం మంజేస్వర్ లో నిర్మించారు. అనేకమంది కవులు, పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.