కాసరోడ్ సమీపం లోని హోసదుర్గ లో కల మదియాన్ కులం టెంపుల్ ఆ గుడి లోని దేవత భద్రకాళి ప్రధాన దేవతగా కలదు. హాస దుర్గ తాలూక లోని కన్హన్గడ్ ప్రధాన కార్యాలయానికి 5 కి.మీ.ల దూరం లో ఈ గుడి కలదు.
ఇది కేరళ రాష్ట్ర ఉత్తర చివరి భాగం. మదియాన్ కులం టెంపుల్ లో ప్రధాన దేవత భద్ర కాలి అయినప్పటికీ, ఇంకా భగవతి, క్షేత్రపాలన్, మరియు, భైరవన్ వంటి ఇతర దేవతలను కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ గుడి ప్రత్యేకత అంటే బ్రాహ్మణ పూజారి పూజ ను మధ్యానం వేళా నిర్వహిస్తారు. ఇతర హిందువులైన మనియానిలు పూజ ని ఉదయం , సాయంకాలం చేస్తూ ఉంటారు.
ఈ దేవాలయం లో ఉత్సవాలు ప్రధాన ఆకర్షణ. సాధారణంగా మే, జూన్ మరియు డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ ఉత్సవాలు చేస్తారు. ఈ ఉత్సవాలలో వీరు చేసే బూతం అనే వేడుక ప్రసిద్ధి చెందినది.