లారెంసు స్కూల్ ను సర్ హెన్రీ ఎం లారెంసు 1847 , ఏప్రిల్ 17న స్థాపించారు. దేశంలోని పురాతన స్కూల్ లలో ఇది ఒకటి. కసౌలి నుండి 6 కి. మీ.ల దూరంలో కలదు. ఈ స్కూల్ ఇండియా లోని ప్రముఖ వ్యక్తులను తయారు చేసింది.
సుమారు 139 ఎకరాల లో విస్తరించిన ఈ సంస్థ పెద్ద ఆట స్థలాలు, భవనాలు, హోటళ్ళు , కలిగి వుంది. ప్రకృతి మధ్యలో కల ఈ ప్రాంతం చుట్టూ సేదర్, ఓక్, పైన్ అడవులు కలవు. బ్రిటిష్ పాలనలో దీనికి చక్కని గుర్తింపు కలదు. 1857లో సర్ హెన్రీ మరణం తర్వాత ఈ స్కూల్ ను ప్రభుత్వం తీసుకుంది. గ్రే స్టోన్స్ తో నిర్మించిన ఒక కేతడ్రాల్ స్కూల్ కాంపౌండ్ లో కలదు.