హిమాచల్ ప్రదేశ్ లో ని షిమ్లా జిల్లలో ఉన్న సుట్లేజ్ వాలీ లో నెలకొని ఉన్న చిన్న కుగ్రామం సరహన్. సముద్ర మట్టం నుండి 2165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం ఆపిల్ చెట్ల తోటలు, పైన్ తోటలు, చిన్న ప్రవాహాలు, రాస్టిక్ సెట్టింగులు అలాగే పెంకుటిళ్ళకి ప్రసిద్ది. ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే పర్యాటకులకు ఈ ప్రాంతం అనువైనది. ఈ సరహన్ గ్రామం గురించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. కులూ రాజు పక్క రాజ్యం బుశైర్ మీద యుద్ధం ప్రకటించాడు. బుశైర్ రాజ్యపు రాజు గెలిచి కులూ రాజు ని శిరచ్చేదం చేశాడు. చనిపోయిన కులూ రాజు యొక్క శిరస్సు ని సరహన్ కి ప్రజల సందర్శనార్ధం ఉంచాడు.
కులూ రాజు కుటుంబీకులు అంతిమ కర్మలు ఆచరించడానికి బుశైర్ రాజుని కులూ రాజు శిరస్సు ని కోరగా అతను మూడు షరతులను వారి ముందుంచుతాడు. ఒకటి, కులూ ప్రజలు ఎప్పుడూ తన పాలనని ప్రశ్నించరాదని, రెండు స్వాధీనం చేసుకోబడిన ఈ రాజ్యం తన అధీనం లో నే ఉంటుందని. మూడు, సరహన్ ప్రాంతపు దైవం అయిన రఘునాథ్ ప్రతిమ తిరిగి ఇవ్వబడదని తెలుపుతాడు. ఈ మూడు షరతులను బుశైర్ రాజు దసరా పండుగని క్రమం తప్పకుండా జరుపుకుంటాడన్న మాటని తిరిగి పుచ్చుకున్నాక ఒప్పుకున్నారు.
అందువల్ల ఈ ప్రాంతం లో జరిగే గొప్ప వేడుకగా దశరా పేరొందింది. ఆ తరువాత భీమకాళి దేవత పక్కనే రఘునాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. భీమకాళి టెంపుల్ కాంప్లెక్స్, ది బర్డ్ పార్క్ మరియు బాబా వాలీ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాలు సరహన్ ప్రాంతం లో కలవు. భీమ కాళీ టెంపుల్ కాంప్లెక్స్ 800 సంవత్సరాల క్రితానికి సంబంధించినదని నమ్ముతారు. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. భారతీయ మరియు బౌద్ధుల నిర్మాణ శైలి ని ఈ ఆలయం ప్రతిబింబిస్తుంది. దేశం లో నే 'శక్తి పీఠ్' ల లో ఒకటి గా అలాగే పుణ్యక్షేత్రం గా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. రిజర్వాయర్ సరస్సులతో అలాగే ఆల్పైన్ మెడోస్ లతో ఆకట్టుకునే ప్రకృతి దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. సహారన్ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం బర్డ్ పార్క్.
ఇది నెమళ్ళ సంతానోత్పత్తి కేంద్రమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి స్థావరం కూడా. దట్టమైన పచ్చని డియోడార్ చెట్లు, మంచుతో కప్పబడిన బశల్ పర్వతాల కి ఈ ప్రాంతం ప్రసిద్ది. సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ కి సరహన్ ప్రసిద్ది. మహాశివుడి కి ఈ హిందూ పుణ్యక్షేత్రం అంకితమివ్వబడినది. శివుడు ఈ ప్రాంతం లో నే తపస్సుచేసాడని హిందూ పురాణాలూ చెబుతున్నాయి. గొప్ప భారతీయ ఇతిహాసమైన 'మహాభారతం' , పాండవులు శిఖరానికి వచ్చారని చెబుతోంది. సందర్సకులకి ఈ పర్వతం అధ్బుతమైన ట్రెక్కింగ్ అవకాశాలను కలిగిస్తుంది.
బంజారా రిట్రీట్, గౌరా, దరంగ్ ఘటి మరియు సంగ్లా వాలీ లు ఈ సరహన్ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. సరహన్ నుండి 20 కిలో మీటర్ల దూరం లో ఉన్న జియోరి లో వేడి నీటి కొలను ఉంది.సరహన్ నుండి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న బంజారా ఆకుపచ్చని ఆపిల్ తోటలకి ప్రసిద్ది. సరహన్ కి సమీపం లో ఉన్న సంగ్లా వాలీ ఆపిల్ మరియు చెర్రీ తోటలకి అలాగే గ్లేసియల్ స్ట్రీమ్స్ కి ప్రసిద్ది. రోడ్డుమార్గం, వాయు మార్గం లేదా రైలు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా సరహన్ కి చేరుకోవచ్చు. ఏప్రిల్ నుండి నవెంబర్ నెలల లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. శీతాకాలం లో కూడా ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరం గా ఉండడం వల్ల పర్యాటకులు ఈ సమయాన్ని కూడా సందర్శనకి పరిగణలోకి తీసుకోవచ్చు.