హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలాంగ్ ఉదయపూర్ లోని ఒక అందమైన పర్యాటక ప్రదేశం. సముద్రమట్టానికి 2523 మీటర్ల ఎత్తున ఉన్న కీలాంగ్ మేయర్ నల్లా కూడలిలో ఉంది. పూర్వం దీన్ని మార్కుల్ లేదా మార్గుల్ అనేవారు, 1695 లో చంబా రాజు ఉదయసింగ్ దీనికి ఉదయపూర్ గా నామకరణం చేసాడు.
ఈ గ్రామం మొత్తం కైల్ అడవులతో (నీలి చెక్క చెట్లు)చుట్టుముట్టబడి వుంది. తక్కువ ఎత్తులో వుండడం వల్ల ఇక్కడ అక్రూట్ లు, నేరేడు, యాపిల్ లాంటి పళ్ళు కాస్తాయి. 1939 లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జర్మన్ సంగీతకారుడు హెర్మాన్ గోఎట్జ్ దీని ప్రాకృతిక అందాన్ని ప్రశంసించి, దీన్ని స్విట్జర్లాండ్ లోని పర్వతాలతో పోల్చాడు.
ఇక్కడి త్రిలోకినాద్ గుడి, మార్కులా దేవి గుడికి కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ రెండు ధార్మిక క్షేత్రాలు కూడా దేశం మొత్తం నుంచి ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి