కొట్టతవళం కొట్టాయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కురిసుమల వద్ద మురుగన్ కొండల సమీపంలో ఒక అద్భుతమైన గుహ లోఉంది. ఈ ప్రదేశం కొట్టాయంకు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది.గుహ లోపలకు రాళ్ళతో చెక్కబడిన మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ గుహలో కుర్చీలు మరియు పడకల రూపంలో శిల్పాలు ఉన్నాయి.
స్వామి అయ్యప్ప, మురుగన్, మధురై మీనాక్షి మరియు కన్నకి యొక్క దేవుని బొమ్మలు కూడా చెక్కబడ్డాయి.ఈ గుహలో పురాణానికి సంబదించిన విషయాలు ఉంటాయి.పూంజర్ వెళ్ళే మార్గంలో మధురై రాజ కుటుంబం ఈ ప్రదేశంలో ఒక తాత్కాలిక నివాసము ఏర్పాటు చేసుకుంది.మలయాళం లో, "కొత్త"అంటే కోట మరియు 'వళం 'అంటే "అధిక భూమి" అని అర్ధం. ఇక్కడకు ప్రతి సంవత్సరం వందల మంది పర్యాటకులు వస్తారు.