పూంజర్ ప్యాలెస్ కొట్టాయం నుండి పాల-ఎరాట్టుపెట్ట కు పూంజర్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.ఈ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. ప్యాలెస్ లో రాచరిక పురాతన వస్తువులు, సుందరమైన శిల్పాలు మరియు రాళ్ళ నుండి చెక్కబడిన దీపాలు చాలా ఉన్నాయి.రాజభవనము యొక్క అందం మెరుగుపర్చే అద్భుతమైన ఛాండిలీయర్ దీపాలు మరియు ఇతర సున్నితమైన దీపాలు, ఆభరణాల పెట్టెలు,చెక్క తో చేసిన నగిషిలు ఉన్నాయి.
మీరు ప్యాలెస్ లో పురాతన కాలం నాటి విగ్రహాలు, శిల్పాలు నటరాజ విగ్రహం మరియు ఆయుధాలు,లలిత కళా నైపుణ్యంను చూడవచ్చు.పూంజర్ ప్యాలెస్ సమీపంలో, మధురై యొక్క మీనాక్షి ఆలయం ను రీప్రొడక్షన్ చేస్తున్నారు.ఈ ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు మనకు పురాణ కధలను వర్ణిస్తాయి.ఈ ఆలయ ప్రత్యేకత రాళ్ళు మెలితిరిగి ఉంటాయి.