ఎలవీజాపూంఛిరా అందమైన వనభోజనా స్థలంగా సందర్శకులకు ప్రఖ్యాతమైనది. ఇక్కడ చిన్నకొండలు యొక్క కొనలు మరింత ఆకట్టుకొంటాయి.ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం చాలా మంది అధిరోహకులకు ఇష్టమైన ప్రదేశం.మీరు ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ నుండి చాలా అందమైన ఉదయిస్తున్న సూర్యుడి మరియు అస్తమిస్తున్న సూర్యుడిని చూడవచ్చు.
కొట్టాయం నుండి మీరు ఎలవీజాపూంఛిరా చేరుకోవడానికి పాలై వైపు 55 కి.మీ. ప్రయాణం ఉంటుంది. ఇక్కడ మూడు ఆకర్షణీయమైన కొండలు ఉన్నాయి.అవి తోనిప్పర ,మన్కున్ను , మరియు కోడయతూర్మల్. ఇవి అతి చిన్న ప్రాచీన మైన కొండలు ట్రెక్కింగ్ కి చాల అనుకూలంగా ఉంటాయి. చిన్నకొండలు మీద నుంచి కొట్టాయం, ఇడుక్కి, పతనంతిట్ట,ఎర్నాకులం ,త్రిసూర్ మరియు అలప్పుజ యొక్క అందాలను చూడవచ్చు.
పూంజర్ ప్యాలెస్
పూంజర్ ప్యాలెస్ కొట్టాయం నుండి పాల-ఎరాట్టుపెట్ట కు పూంజర్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.ఈ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. ప్యాలెస్ లో రాచరిక పురాతన వస్తువులు, సుందరమైన శిల్పాలు మరియు రాళ్ళ నుండి చెక్కబడిన దీపాలు చాలా ఉన్నాయి.రాజభవనము యొక్క అందం మెరుగుపర్చే అద్భుతమైన ఛాండిలీయర్ దీపాలు మరియు ఇతర సున్నితమైన దీపాలు, ఆభరణాల పెట్టెలు,చెక్క తో చేసిన నగిషిలు ఉన్నాయి. మీరు ప్యాలెస్ లో పురాతన కాలం నాటి విగ్రహాలు, శిల్పాలు నటరాజ విగ్రహం మరియు ఆయుధాలు,లలిత కళా నైపుణ్యంను చూడవచ్చు.పూంజర్ ప్యాలెస్ సమీపంలో, మధురై యొక్క మీనాక్షి ఆలయం ను రీప్రొడక్షన్ చేస్తున్నారు.ఈ ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు మనకు పురాణ కధలను వర్ణిస్తాయి.ఈ ఆలయ ప్రత్యేకత రాళ్ళు మెలితిరిగి ఉంటాయి.
తిరునక్కర మహాదేవ ఆలయం
తిరునక్కర మహాదేవ ఆలయం లార్డ్ శివకు అంకితం చేయబడింది.తేక్కుమ్కూర్ రాజు దీనిని 16 వ శతాబ్దం ప్రారంభంలోనిర్మిచారు. ఇది కొట్టాయం ప్రధాన నగరంలో ఉంది. ఇది కేరళ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయము కొట్టంబలం నమూనాగా పేరుగాంచింది.కొట్టంబలం అంటే సంప్రదాయ కళ మరియు నృత్య రూపాలు ఉంటాయి.ఇక్కడ ఆలయం లో ధ్వని సంబంధిత థియేటర్ ఉంది. ఈ శివాలయం యొక్క గోడలపై కుడ్యచిత్రాలు ఉంటాయి,వాటి వల్ల మనకు పురాణాలు గురించి తెలుస్తున్నది.దేవాలయం యొక్క అందాన్ని చూడడానికి వచ్చిన భక్తులు కాక మరియు అనేక మంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు.'ఫాల్గుణ ఉత్సవం' మార్చి మరియు ఏప్రిల్ నెలలలో మీనం యొక్క హిందూ మతం మాసంలో జరుపుకుంటారు. ఆలయ వార్షిక ఉత్సవం ఇదే సమయంలో జరుగుతుంది.ఈ పండుగ 10 రోజుల పాటు జరుపుకుంటారు మరియు 'ఆరాట్టు' తో పండుగ ముగిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వివిధ ఆలయం కళలను ఈ పండుగ సమయంలో ప్రదర్శిస్తారు.
తజతంగడి జుమ మస్జిద్
మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి మరియు 1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైనది, దాని నిర్మాణ శోభకు, మరియు కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడింది.ఈ మసీదును ఎక్కువగా "తాజ్ జుమ మస్జిద్"అనే పేరుతో పిలుస్తారు.మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్ కొట్టాయం కి 7Km దూరంలో ఉంటుంది.మీరు కొట్టాయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదేశం ను సందర్సించాలి.
సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి
కొట్టాయం నుంచి 2 Km దూరంలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి ఉంది.1579లో తెక్కుమ్కుర్ రాజు తన క్రైస్తవ పౌరుల కొరకు దీనిని నిర్మించాడు.ఈ చర్చి ఒక ఆర్థడాక్స్ సిరియన్ చర్చి. చర్చి నిర్మాణం పోర్చుగీస్ శైలి మరియు కేరళ శైలి లో కనపడుతుంది.కూరగాయల రంగులను ఉపయోగించి గీయబడిన లోపలి కుడ్యచిత్రాలు బైబిల్ లోని విషయాలను వివరిస్తాయి. ఈ చర్చిని చాలా మంది పర్యాటకులు సందర్శిస్తారు.మీరు ఒక కళా ప్రేమికుడు అయితే తప్పనిసరిగా దీనిని సందర్సించాలి.ఇక్కడ కల అద్భుత నిర్మాణం మరియు ఆహ్లాదకరమైన చక్కని కుడ్య చిత్రాలు మిమ్మల్ని ఎంతో అలరిస్తాయి.
నట్టకం
నట్టకం అనే గ్రామం కొట్టాయంలోని పల్లం తాలూకాలో ఉంది. కొట్టాయం నగరానికి నట్టకం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామం చుట్టూ పచ్చదనం తో ఉండుట వల్ల అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది.వేసవి కాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి.ఈ పక్షుల అరుపులు ఒక సంగీత వాతావరణాన్ని కలిగిస్తాయి.కొట్టాయం పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ (KPCT) నట్టకంలో ఉన్నాయి.మీరు ఒకసారి తప్పకుండా నట్టకంను సందర్శించండి.ఇక్కడ ఆయుర్వేద మసాజ్ మరియు ఈత, ఫిషింగ్ మరియు బోటింగ్ వంటి ఇతర వినోదాలు కూడా ఉన్నాయి.మీకు ఫోటోగ్రఫి మీద ఆసక్తి ఉంటే సందర్శించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.
పంచికడు
పంచికడు కొట్టాయం జిల్లాలోఉన్న మరొక చిన్న నిద్రావస్థ గ్రామం.కొట్టాయం మరియు చంగనస్సేరి మధ్య ప్రధాన రోడ్ మీద ఉంది. పంచికడు కొట్టాయం కి 11km దూరంలో ఉంది.ఈ గ్రామంలో సరస్వతి ఆలయం ఉంది. ఈ ఆలయం ను దక్షిణ మూకంబికగా కొలుస్తారు.ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు చేస్తారు.ఇక్కడ ప్రకృతి దృశ్యాలు మనసును రంజింప చేస్తాయి.ఈ చిన్న గ్రామంలో మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.ఈ గ్రామం ప్రకృతి చిత్రీకరణకు అనువైన ప్రదేశం.
కొట్ట తవళం
కొట్టతవళం కొట్టాయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కురిసుమల వద్ద మురుగన్ కొండల సమీపంలో ఒక అద్భుతమైన గుహ లోఉంది. ఈ ప్రదేశం కొట్టాయంకు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది.గుహ లోపలకు రాళ్ళతో చెక్కబడిన మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ గుహలో కుర్చీలు మరియు పడకల రూపంలో శిల్పాలు ఉన్నాయి. స్వామి అయ్యప్ప, మురుగన్, మధురై మీనాక్షి మరియు కన్నకి యొక్క దేవుని బొమ్మలు కూడా చెక్కబడ్డాయి.ఈ గుహలో పురాణానికి సంబదించిన విషయాలు ఉంటాయి.పూంజర్ వెళ్ళే మార్గంలో మధురై రాజ కుటుంబం ఈ ప్రదేశంలో ఒక తాత్కాలిక నివాసము ఏర్పాటు చేసుకుంది.మలయాళం లో, "కొత్త"అంటే కోట మరియు 'వళం 'అంటే "అధిక భూమి" అని అర్ధం. ఇక్కడకు ప్రతి సంవత్సరం వందల మంది పర్యాటకులు వస్తారు.
పల్లిప్పురతు కవు
పల్లిప్పురతు కవు కోడిమత అనే ప్రదేశంలో కొట్టాయం యొక్క దక్షిణ భాగం లో ఉంది. ఈ ఆలయంలో దేవత భద్ర కాళి. విష్ణువు మరియు పతముదయం పల్లిప్పురతు కవు ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. తీయట్టు సంప్రదాయమ్ ను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ సమర్పణ వారి కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం భక్తులు చేస్తారు.ఒక భద్ర కాళి నుండి ఆశీర్వాదం పొందితే ఆ దేవత అనారోగ్యం మరియు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని స్ధానికులు నమ్ముతారు.
సరస్వతి ఆలయం
కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని కిజ్హేప్పురం నంబూద్రి ప్రతిష్ట చేసారు. దీనికి పశ్చిమంగా మరో విగ్రహం ఉంటుంది, కానీ విగ్రహం ఏ ఆకారంలోను ఉండదు,కానీ దానిని పూజిస్తారు.ఈ విగ్రహం దగ్గర అన్ని సమయాలలో వెలిగే రాయిదీపం ఉంది. పణతి కుతూ చెడి మొక్కలు తూర్పు ముఖంగా ఉన్న విగ్రహం చుట్టూఉంటాయి. ఎవరూ ఈ మొక్కలు తొలగించడానికి అనుమతి లేదు, మరియు ఈ మొక్కలు ఎప్పుడూ వాడిపోయి ఉంటాయి. ఈ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.ఆలయం ఉదయం 5.30 నుంచి 11.30 వరకు,మరియు సాయంత్రం 5 గం.నుండి 7,30 గం. వరకు తెరచి ఉంటుంది.
తిరువేర్పు ఆలయం
తిరువేర్పు ఆలయం లో కృష్ణుడు కొలువై ఉంటాడు.ఇది కేరళ రాష్ట్రంలో మరొక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయం కొట్టాయం నుండి 7 కి.మీ. ప్రయాణం దూరంలో మీనచిల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం కట్టినదిగా భావిస్తున్నారు.ఈ ఆలయం నకు అనేక పురాణములతో సంబంధం ఉంది.అయితే, ఈ పురాణములు ఆలయ కృష్ణుడు గురించి ఉంటాయి.ఆలయం యొక్క దేవత నాలుగు చేతులు కలిగి, మరియు విగ్రహం ఒక పీఠంపై ఉంచబడినది. ఈ ఆలయం నకు అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నయి.మొదటిది వీ అవర్స్ పాయాసం రూపకల్పనపై పద్ధతి. రెండవది, ఆలయ పూజారికి ఒక గొడ్డలి అలాగే ఆలయం తలుపు తెరవడానికి తాళం చెవి ఇవ్వబడుతుంది. ఏ కారణంగా అయినా సరే తలుపు కీ ద్వారా తలుపు తెరవబడదు అంటే , పూజారి గొడ్డలి ఉపయోగించి విరగ కొడతాడు.మూడవది ఆలయము గ్రహణం సమయంలో తెరిచే ఉంటుంది.తిరువేర్పు ఆలయం లోపల భూతనాథ దేవాలయం కూడా ఉంది.అంతేకాకుండా, ఆలయం వెలుపల వేదిక గణపతి, సుబ్రహ్మణ్య, శివ,భగవతి మరియు యక్షి కోసం ఆలయాలు ఉన్నాయి.
సుబ్రమణ్య స్వామి ఆలయం
కొట్టాయం నుండి 20 కి.మీ.లదూరంలో సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్నది. సుబ్రమణ్య స్వామికి కేరళలో ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయం లోకి కుల,మతాలకు సంబంధం లేకుండా అందరు వెళ్ళే మొదటి ఆలయం. క్రీ.శ.753 నాటి చాలా పాత ఆలయం. ఆలయం విగ్రహం 6 అడుగుల పొడవు ఉంటుంది.సుబ్రమణ్య స్వామి చేతిలో ఒక ఈటె లాంటి ఆయుధం ఉంటుంది.'పల్లిమెట్ట ఉత్సవ్'ను ఈ ఆలయంలో జరుపుకుంటారు,ఇది వార్షిక ఉత్సవం. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది మరియు నవంబర్ మరియు డిసెంబర్ లలో వస్తుంది.ఈ పండుగ సమయంలో చేసిన ప్రధాన ఆచారము చాకిఅర్కూత్ ఉంది. సుబ్రమణ్యస్వామి ఆలయం ఉర్జమా దేవస్వామ్ బోర్డు చే నిర్వహించబడుతుంది. ఇది ఒక పురాతన దేవాలయం, ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.