కోవలం సముద్ర తీరానికి దక్షిణపు అంచున లైట్ హౌస్ తీరం ఉంది. నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ తీరానికి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. పాత రోజులలో ఈ తీరం పక్కనే ఉన్న కొండమీద విజింజం లైట్ హౌస్ గా పిలువబడే ఒక దీపస్తంభం ఇక్కడ ఉండేది. ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు మార్గదర్శనం చేసేది. యూరోపియన్ యాత్రికులు నగరంలోకి రావడం మొదలుపెట్టాక దీపస్తంభం ఉండడం వల్ల దీన్ని లైట్ హౌస్ తీరంగా వ్యవహరించేవారు. అదృష్టవశాత్తూ, కాలగమనం గానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ దీపస్తంభాన్ని ప్రభావితం చేయలేదు. రాత్రిపూట ఈ దీపస్తంభం నుంచి వెలువడే కాంతిరేఖలు ఈ తీరానికి ఒక అందమైన లక్షణాన్ని అందించాయి. అందువల్ల, అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడడానికి ఈ తీరాన్ని రాత్రిపూటే సందర్శించాలి. జనవరి నెలలో సైతం వెచ్చగా ఉండే ఈ తీరంలోని స్వచ్చమైన నీటిలో నమ్మశక్యం కాని ఈతను అందిస్తుంది.