కేరళ రాష్ట్రంలోని విజింజం గ్రామం కోవలం నగరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆయుర్వేద మర్దనా కేంద్రాలకు, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన తీర విహార కేంద్రాలకు ఈ గ్రామం బాగా ప్రసిద్ది చెందింది.మీకు సహజంగా ఏర్పడ్డ ఒక రేవును చూడాలనిపిస్తే ఇక్కడికే రావాలి. ఇటీవలి పురావస్తు తవ్వకాలు ప్రాచీన కాలంలో విజింజం గ్రామం ప్రముఖ రేవు పట్టణంగా వర్ధిల్లిందని సూచిస్తున్నాయి. రోమన్ల యుగంలో ఇక్కడి నుంచి సముద్ర వర్తకం జరిగింది – ఎర్ర సముద్రపు తీరం వెంట వున్న దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు కలిగి వుండేది. పద్నాలుగు, పదిహేను శతాబ్దాలలో పోర్చుగీస్, డచ్ వర్తకులు కూడా ఇక్కడికి వచ్చి తమ వస్తువులు అమ్ముకుని, ఇక్కడి వస్తువులు కొనుక్కునే వారు. సముద్రానికి దగ్గరలో ఈ గ్రామం పరిధిలో వున్న పోర్చుగీస్ వారి చర్చి దీన్నే సూచిస్తోంది. ఇదే పాత విజింజం చర్చి.మీకు సమయం వుంటే హాయి గొల్పే మూలికా తైలాలతో మర్దనా చేయించుకోండి.