కుద్రేముఖ్ సందర్శించే పర్యాటకులు కుద్రేముఖ్ శిఖరాన్ని కూడా తప్పక చూసి ఆనందించాలి. ఇది సముద్ర మట్టానికి 1894 అడుగుల ఎత్తున ఉంది. ట్రెక్కింగ్ లేదా అటవీ పరిశోధన చేయాలనుకునేవారికి కుద్రేముఖ్ శిఖరం ఎంతో అనువుగా ఉంటుంది. ఈ ప్రదేశం చేరిన తర్వాత పర్యాటకులు ఈ పర్వత శ్రేణులు సమూహ అనుసంధానంపై అచ్చెరువొందుతారు. కుద్రేముఖ్ శిఖరంనుండి అందమైన అరేబియా సముద్రం చూసేందుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. పర్యాటకులు సింహాలను కొండ ముచ్చులను చూసి ఆనందించవచ్చు. కుద్రేముఖ్ శిఖరాన్ని చూడగోరే పర్యాటకులకు అన్నిరకాల వసతులు, ట్రెక్కింగ్ కు అవసరమైన పరికరాలు అందజేస్తారు. కుద్రేముఖ్ శిఖరం వద్ద తగిన బస సదుపాయాలుంటాయి కనుక యాత్రికులు తమ వసతికై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ అటవీ లాడ్జి లు, గెస్ట్ హౌస్ మొదలైనవి ఉంటాయి. ఈ ప్రదేశం చేరటానికి సమీప కలాసా టవున్ నుండి బస్సులు, ప్రయివేట్ వాహనాలు ఉంటాయి.