కుద్రేముఖ్ సందర్శించే పర్యాటకులు సమయం ఉన్నదనుకుంటే హనుమాన్ గుండి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తునుండి ప్రవహిస్తాయి. హనుమాన్ గుండి జలపాతాలను మరో పేరుగా సుత్తన్నబ్బే ఫాల్స్ అని కూడా అంటారు. ఇవి కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కొండ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులకు బాగుంటుంది. అక్టోబర్ నుండి మే నెలల మధ్య ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉంటుంది. హనుమాన్ గుండి జలపాతాలు కర్కాల మరియు లఖ్య డాం ల మధ్య ఉన్నాయి. కనుక ప్రశాంత వాతావరణం అనుభవించాలనుకునేవారు ఇక్కడకు తప్పక చేరి ఆనందించవచ్చు. సురక్షితంగా ఈ జలపాతాలలో విహరించాలనుకునేవారు ఒకరికి 30 రూపాయల చొప్పున రుసుము చెల్లించాలి. అటవీ శాఖ ఇక్కడ సురక్షితం కొరకు మెట్లను నిర్మించింది. ఈ మెట్ల ద్వారా జలపాతాలలోకి వెళ్ళి ఆనందించవచ్చు.