కుమరకొం బర్డ్ సాంచురి లేదా వెంబనద్ బర్డ్ సాంచురి, వెంబనద్ లేక్ కి తూర్పు ఒడ్డున ఉంది. బ్యాక్ వాటర్స్ నేపధ్య్హంలో ఏర్పాటు చేయబడిన ఈ సాంచురి మంత్రముగ్ధులని చేస్తుంది. వందలాది వలస పక్షులకి నివాస స్థలమైన ఈ సాంచురి, పక్షులపై పరిశోధనలు చేసేవాళ్ళకు మరియు పక్షి ప్రేమికులకు కను విందు కలిగిస్తుంది. 14 ఎకరాల మేరకు ఈ సాంచురి విస్తరించబడి ఉంది. హిమాలయాలు మరియు సైబేరియా వంటి వివిధ ప్రదేశాల నుండి ఎన్నో పక్షులు ఇక్కడికి తరలి వస్తాయి. కోకిల, నీటిపక్షులు, కొంగ, నీటికాకి, గుడ్లగూబ, టేల్, భరద్వాజ పక్షి, ఎగ్రేట్, మూర్హెన్, సైబేరియన్ కొంగ,డార్టర్, బ్రాహ్మినీ గడ్డ, చిలుక, ఫ్లై కాచర్ వంటి వి ఇక్కడ ప్రధానంగా కనిపించే పక్షి జాతులు.పక్షి ప్రేమికులు సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో ట్రెక్కింగ్ చేస్తే ప్రశాంతమైన ఆకాశంలో గుంపుగా ఎగిరే పక్షులను తిలకించి ఆనందం పొందవచ్చు. సాంచురి లో ని పక్షులని చూసి ఆనందించడానికి బోట్స్ (హౌస్ బోట్స్ లేదా మోటార్ బోట్స్) ని అద్దెకి తీసుకొనవచ్చును. ట్రెక్కింగ్ సమయంలో పర్యాటకులు ఒక గైడ్ ని కూడా నియమించుకోవచ్చు. అదనపు సమాచారం సమయం : ఉదయం 10 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు ఛార్జీలు : 5 INR (భారతీయులకు నిర్వహణ ఛార్జీలు), 45 INR (విదేశీయులకు నిర్వహణ ఛార్జీలు)గైడ్ ఛార్జీలు : 100 - 200 INR బోటు ట్రిప్ : 200 - 250 INR (రెండు గంటలకు)బెస్ట్ సీజన్ : నవెంబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించేందుకు ఉత్తమ సమయం : తెల్లవారు జామున, సూర్యోదయ సమయం



Click it and Unblock the Notifications