ఈ దేవాలయ నిర్మాణంలో మూడు దేశాల బౌద్ధ భక్తుల సహకారం ఉన్నదని స్పష్టంగా గోచరిస్తున్నది, నిజానికి బుద్ధుడి విగ్రహ తయారీలో ఉపయోగించిన 'అష్ట ధాతు' లేదా ఎనిమిది లోహాల మిశ్రమాన్ని జపాన్ నుండి తెచ్చారు మరియు దీని నిర్మాణానికి ప్రధానంగా జపనీస్ రాచరికం వారే ప్రధానంగా నిధులు వెచ్చించారు. జపాన్ నుండి విగ్రహాన్ని తెస్తున్నప్పుడు అది రెండు ముక్కలుగా విరింగింది మరియు దేవాలయం వొడ్డ దానిని తిరిగి అసలు రూపంలో జత చేశారు.
ఈ విగ్రహ రూపకల్పన మరియు నిర్మాణం అటాగో ఇస్శిన్ ప్రపంచ బౌద్ధ సాంస్కృతిక అసోసియేషన్ వారిచే జరిగింది మరియు దీని ఖర్చు, పైన చెప్పినట్లుగా జపనీస్ రాజు భరించారు. బుద్ధుడి అష్ట ధాతు విగ్రహం దేవాలయంలో అద్భుతమైన వృత్తాకార చాంబర్ లో ఉంచారు. కిటికీల నుండి విగ్రహం మీద పడుతున్న మృదువైన కాంతి, ఆధ్యాత్మిక తేజం మరియు శాంతియుత వాతావరణం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. బుద్దుడి విగ్రహాన్నిచూస్తున్న, అతని పది ప్రధాన భికుస్ చిత్తరువులను జపనీస్ శైలిలో చెక్కబడి ఉండటం చూడవొచ్చు.