జుమా మసీదు మూడు గోపురాలు, రెండు మినార్లతో లక్నోలోని అవద్ నవాబు కాలపు విలాసవంతమైన, సంపద గుర్తుకు సాక్ష్యంగా నిలిచింది. నవాబ్ మొహమ్మద్ అలీ షాహ్ ఎంతో అందమైన, దేశం మొత్తంలో లోని పోటీదారులను అధిగమించే ఒక అద్భుతమైన మసీదుని నిర్మించాలని అనుకున్నాడు, అయితే, అతను దీర్ఘకాల కీళ్ళవాతానికి గురయ్యి 1842 లో మరణించాడు, తన కలను పూర్తిచేయలేక పోయాడు. ఈ మసీదును చివరికి ఆయన భార్య మల్లికా జెహాన్ బేగం పూర్తిచేసారు.
ఈ గొప్ప మసీదు 4950 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణ రూపకల్పన, సున్నితమైన అలంకరణలు, చెక్కుళ్ళు, మసీదు బైట గోడలపై ఉన్న అందమైన చేతివ్రాతలు హిందూ, జైన ఆలయాల ప్రాభవాన్ని కనబరచేవి. లోపలి గోడలు పూతపూసిన అద్దాలు, వెండి పల్పిట్లు, అభూతమైన మొఘల్ శైలి ఫ్రేస్కోలు, అద్భుతమైన శాండ్లియర్ల తో అలంకరించబడి ఉంటాయి.
ఈ మసీదు ఆర్చ్ తో కూడిన గోపురాలు 260 స్ధంభాల మీద వివిధ ఎత్తులో నిలబడి ఉంటాయి. అహ్మద్ షాహ్ సమాధి భవనానికి తూర్పు భాగంలో ఉంది.



Click it and Unblock the Notifications