సహ్యాద్రి శ్రేణి లోని పర్వత ప్రాంతాల్లో వుండడం వల్ల మల్షేజ్ ఘాట్ పర్వతారోహణ కు అనువుగా వుంటుంది. ఈ ఆరోహణ ప్రక్రుతి మాతకు మిమ్మల్ని చేరువగా తీసుకువెళ్ళి మీరు ఆ అందాలను మరింత ఆస్వాదించేలా చేస్తుంది.మల్షేజ్ ఘాట్ అటు ఔత్సాహికులకు, ఇటు సవాళ్ళు ఎదుర్కొనే ప్రావీణ్యం వున్న వారికీ కూడా చాలా ఆరోహణ మార్గాలు అందిస్తుంది. దార్కొబా కొండ ఈ ప్రాంతంలోకెల్లా ఎత్తైనవి. అజోబా కొండ, జీవధాన్ చావాండ్ కోట, నానే ఘాట్ ఇతర ప్రసిద్ధ ఆరోహణ ప్రదేశాలు.పర్వతారోహణ, ధార్మిక పర్యటన కలిపి చేయాలనుకునేవారు ఒజ్హార్, లేన్యాద్రి మార్గాలు ఎంచుకోవచ్చు. ఈ రెండు గణపతి దేవాలయాలు వున్న ప్రసిద్ధ ధార్మిక కేంద్రాలు.



Click it and Unblock the Notifications