సాజన్ అని కూడా పిలువబడే సజన్, మహారాష్ట్రలోని థానే జిల్లాలో వున్న చిన్న పట్టణం, ఇది ముంబై నుంచి 113 కిలోమీటర్ల దూరంలో వుంది.
సపోటా, మామిడి చెట్ల తో నిండిన దట్టమైన పచ్చటి అడవులతో ఈ సజన్ ప్రాంతం అంతా కప్పబడి వుంది.
చారిత్రికంగా ప్రాధాన్యత
టోలెమీ తన గ్రంధాలలో సజన్ ను చేర్సోనేసస్ గా ప్రస్తావించాడు. ఇక్కడి కోహోజ్ కోట భోజ్ ల కాలం నాటి చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది.
1530 లో పోర్చుగీస్ వారు దాడి చేసినప్పుడు సజన్ ను తాన మయంబు అని వ్యవహరించారు. అటు తర్వాత ఇది 1300 నుంచి 1660 వరకు దాదాపు 360 ఏళ్ళ పాటు ముస్లిం పాలనలో ఉండిపోయింది. చివరిగా 1660 నుంచి 1800 మధ్య మరాఠాలు చేజిక్కించుకోగా, తర్వాత బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళింది.
సజన్ కాలక్రమేణా దేశం అంతటి నుంచీ పర్యాటకులను ఆకర్షించే ప్రధాన పర్యాటక కేంద్రం అయిపొయింది. ముంబై నుంచి దగ్గరగా వుండడంతో ఈ ప్రదేశం మరింత ప్రసిద్ది చెందింది.
ప్రకృతి, ధార్మికత కలిసే చోటు
ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే వున్నాయి. ఎండిపోకుండా నిరంతరం ప్రవహించే 60అడుగుల ఎత్తున్న పలుసా జలపాత౦ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. మీ కుటుంబంతో కలిసి సేద తీరడానికి మోహో కుర్ద్ డ్యాం మరో సహజ సిద్ధంగా ఏర్పడ్డ విహార కేంద్రం.
చరిత్ర ప్రేమికులకు ఇక్కడి టైగర్ గుహలు, కోహోజ్ పర్వత కోట ఆసక్తి కలిగిస్తే, ప్రధానంగా పండుగ రోజుల్లో చాలా మంది యాత్రికులను ఆకర్షించే పీష్వా గుడి, మహాలక్ష్మి గుడి ఆధ్యాత్మికత కు పట్టుగొమ్మలు.
ఏడాది పొడవునా విహార యాత్రకు అనువుగా వుండే సజన్ కు వాయు, రైలు, రోడ్డు మార్గాల్లో తేలిగ్గా చేరుకోవచ్చు