బౌద్ధులకు ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం ఇది. టిబెట్ నుండి భారత దేశానికీ అధిక సంఖ్యలో విచ్చేస్తున్నవలసదారుల కోసం 1960 లో ఈ మఠం నిర్మించబడినది. ఈ మఠం యొక్క ప్రత్యేకత పసుపు పచ్చని పై కప్పు. దీనిని సంప్రదాయ అంతస్తుల గోపురం పైన పగోడా శైలి లో నిర్మించారు.
ఈ మఠం లో బుద్ధుని విగ్రహం తో పాటు, బౌద్ధుల సిద్ధాంతాలను ప్రతిబింబించే చిత్రలేఖనాలు కలవు. టిబెటన్ ఆక్రమణల సమయంలో మృతి చెందిన వారి పేర్ల జాబితా ఈ మఠం లో ప్రదర్శించారు. ఈ మఠానికి సమీపంలో ఉన్న షాపు లో పర్యాటకులు టిబెటన్ ల హస్తకళాకృతులు, కార్పెట్లు వంటివి కొనుక్కోవచ్చు. ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఈ మఠం సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది.



Click it and Unblock the Notifications