సముద్ర మట్టం నుండి 6223 మీటర్ల ఎత్తులో ఉన్న ఇంద్రాసన్ పీక్, లహౌల్ మరియు స్పిటి జిల్లాల్లో ఉన్న ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ట్రయల్. పార్వతి నది అలాగే బీస్ నది మధ్యలో ఉన్న ఎత్తైన కొండ వద్దకి ఈ ట్రెక్కింగ్ ట్రయల్ తీసుకువెళుతుంది. ఈ మార్గం లో పయనించే ప్రయాణికులు అలిరతాన్ పీక్, ఇంద్రాసన్ పీక్, పంచరతన్ పీక్ మరియు డియో టిబ్బా పీక్ వంటి మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు గమనించవచ్చు.
ప్రసిద్ది చెందినా జానపద కథ ప్రకారం, హిందూ మతం యొక్క దేవతల రాజు అయిన ఇంద్రుడు ఈ పర్వతం వద్ద ఒకసారి ఆశ పొందాడు. ట్రెక్కింగ్ ద్వారా ఈ శిఖరానికి చేరుకున్న పర్యాటకులు అందరు దేవుళ్ళ మరియు దేవతలు కలిసే ప్రాంతం గా నమ్మే చంద్రఖని పాస్ ని చూడవచ్చు.



Click it and Unblock the Notifications