నామ్సాయి అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రధానమైన పట్టణాల్లో ఒకటి. ‘బంగారు గోపురాల ప్రదేశం’గా పిలువబడే నామ్సాయి, లోహిత్ జిల్లాలోని దిహింగ్ నది వద్ద వుంది. దేశ౦ నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంతో ఈ పట్టణం వేగంగా అభివృద్ది చెందుతోంది. గిరిజన, ఆధునిక జీవన శైలుల మేలుకలయిక నామ్సాయి పట్టణం.
మార్చ్ 2002 లో నామసాయి వద్ద దిహింగ్ నది పైన 660.37 మీటర్ల పొడవు గల వంతెన నిర్మించారు. చాలా కాలం నుంచి ఇక్కడి స్థానికులు బౌద్ధం అవలంబిస్తున్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో గౌరవించుకునే ఈ తెగ వారు అరుణాచల్ ప్రదేశ్ లోని నాగరిక జాతుల్లో ఒకరిగా ప్రసిద్ది చెందారు. ఈ జాతుల సంస్కృతి థాయిల్యాండ్ సంస్కృతిని పోలి వుంటుంది. ఆసక్తి కరంగా నామ్సాయి లోని గిరిజనులు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగి ఉజ్వల భవిష్యత్తు ను ఆకాంక్షిస్తున్నారు.